కేసీఆర్‌కు ఇక విశ్రాంతే: పొన్నాల | ponnala lakshmaiah takes on kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు ఇక విశ్రాంతే: పొన్నాల

May 4 2014 2:30 AM | Updated on Mar 18 2019 7:55 PM

కేసీఆర్‌కు ఇక విశ్రాంతే: పొన్నాల - Sakshi

కేసీఆర్‌కు ఇక విశ్రాంతే: పొన్నాల

టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇక విశ్రాంతే శరణ్యమని... తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీయే ఏర్పాటు చేస్తుందని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు.

 తెలంగాణలో తొలి ప్రభుత్వం కాంగ్రెస్‌దేనని జోస్యం

 సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇక విశ్రాంతే శరణ్యమని... తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీయే ఏర్పాటు చేస్తుందని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లో పొన్నాల మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టారన్నారని, తెలంగాణ ఇచ్చినందుకు ఓట్ల ద్వారా కృతజ్ఞత చూపారని పేర్కొన్నారు. కేసీఆర్ మాత్రం ఫాంహౌస్‌లో కూర్చొని అధికారం తమదేనంటూ మైండ్‌గేమ్ ఆడుతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన 55 మంది నేతలు ఉద్యమద్రోహులేనని, వారు రాత్రికి రాత్రి టికెట్లు తెచ్చుకున్నారని విమర్శించారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ సరళిని విశ్లేషించామని.. కొన్ని ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థులకు స్థానిక నేతలు సహకరించలేదని, ఫలితాలు వచ్చాక చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement