మహబూబ్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఓటర్ను పోలీసులు కొట్టడంతో మనఃస్తాపంతో అతను ఆత్మహత్య చేసుకున్నారు.
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఓటర్ను పోలీసులు కొట్టడంతో మనఃస్తాపంతో అతను ఆత్మహత్య చేసుకున్నారు. మల్దకల్ మండలం శేషంపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
జయన్న అనే ఓటరు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఓటర్ల జాబితాలో జయన్న పేరులేదు. దాంతో తన పేరు ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. సిబ్బందితో వాగ్వివాదనికి దిగారు. పోలీసులు ఆగ్రహంతో జయన్నను చితకబాదారు. ఆ తరువాత ఇంటికి వెళ్లిన జయన్న పోలీసులు చితకబాదారని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు.