21న కేసీఆర్ సుడిగాలి పర్యటన | on 21st K. Chandrashekar Rao tour | Sakshi
Sakshi News home page

21న కేసీఆర్ సుడిగాలి పర్యటన

Apr 19 2014 2:48 AM | Updated on Aug 15 2018 9:06 PM

కరీంనగర్ ఎస్సారార్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించి సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరించిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 21న జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు.

రాయికల్/పెద్దపల్లి/గోదావరిఖని, న్యూస్‌లైన్: కరీంనగర్ ఎస్సారార్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించి సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరించిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 21న జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ప్రత్యేక హెలిక్యాప్టర్ ద్వారా ఒకే రోజు ఏకం గా నాలుగు నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో పాల్గొననున్నారు. జగిత్యాల, కోరు ట్ల, ధర్మపురి, పెద్దపల్లి నియోజకవర్గాల్లో ఏ కధాటిగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
 
 అంతకుముందు రోజు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, బెల్లంపల్లి సభల్లో పాల్గొనున్న కేసీఆర్ .. ఆ తర్వాత గోదావరిఖనిలో నిర్వహించే సభకు హాజరవుతారని టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ఉద్యమానికి పురిటగడ్డగా పేరొందిన కరీంనగర్ జిల్లాలో అధిక సంఖ్యలో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా ఆయన ఎక్కడా లేనివిధంగా జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించడం విశేషం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement