గెస్ట్ కాలమ్
జేఈఈ మెయిన్ ఫలితాలు, ఎంసెట్, జేఈఈ అడ్వాన్స్డ్ వంటి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల నేపథ్యంలో... ఐఐటీలు, అప్టిట్యూట్ టెస్ట్, ఇంజనీరింగ్ విద్య తదితర అంశాలపై ప్రొఫెసర్ సరిత్ కుమార్తో గెస్ట్కాలం..
* ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించి తాజాగా ప్రతిపాదించిన స్టాండర్డయిజ్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ప్రధాన ఉద్దేశం.. విద్యార్థుల్లో ఇంజనీరింగ్ విద్య పట్ల ఉన్న వాస్తవ అభిరుచి, ఇంజనీరింగ్ కోర్సుల్లో రాణించేందుకు అవసరమైన సహజ నైపుణ్యాలను గుర్తించడం. దాంతోపాటు కోచింగ్ సంస్కృతికి స్వస్తి పలకడం. ప్రస్తుతం అమలవుతున్న విధానం వల్ల విద్యార్థులు కోచింగ్ ద్వారా పరీక్షల్లో ర్యాంకులు సాధించి ఐఐటీల్లో అడుగు పెడుతున్నారు. ఐఐటీల్లో చేరాక అక్కడి వాతావరణంలో ఇమడలేక ఒత్తిడికి గురవుతున్నారు.
* ఆప్టిట్యూడ్ టెస్ట్లో విజయం సాధించిన విద్యార్థులకు.. ఇంజనీరింగ్ కోర్సుల్లో రాణించేందుకు అవసరమైన బేసిక్స్ను పరీక్షించేందుకు సింగిల్ ఎంట్రన్స్ ఉంటుంది. ఆప్టిట్యూడ్ టెస్ట్లో విజయం సాధించిన విద్యార్థులు... కోచింగ్తో సంబంధం లేకుండా సింగిల్ ఎంట్రన్స్లో రాణించగలరని ఐఐటీ నిపుణుల కమిటీ గట్టిగా నమ్ముతోంది.
* విద్యార్థుల్లో అధిక శాతం మంది గమ్యం ఐఐటీలే!కానీ ఐఐటీల్లో సీట్ల సంఖ్య పరిమితం.. పోటీ మాత్రం అపరిమితం. కాబట్టి విద్యార్థులు ముందు నుంచే ఐఐటీలకు ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టిపెట్టాలి. ఐఐటీలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించే ఇన్స్టిట్యూట్స్ ఎన్నో దేశంలో ఉన్నాయి. అంతేకానీ ఐఐటీలో సీటు రాలేదని కుంగిపోకూడదు.
* ఇంజనీరింగ్లో చేరే విద్యార్థులు క్యాంపస్లో అడుగుపెట్టిన తొలి రోజు నుంచే లక్ష్యం దిశగా కృషి చేయాలి. ఇంజనీరింగ్లో చేరడమే విజయం కాదని.. తమ లక్ష్యం పూర్తి స్థాయిలో సాధించాలంటే నాలుగేళ్ల కోర్సులో రోజూ రాణించడం ముఖ్యమని గుర్తించాలి.
ప్రాక్టికాలిటీతో పర్ఫెక్షన్
ఇంజనీరింగ్లో చేరే విద్యార్థులు ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యం ఇవ్వాలి. బోర్డ్ సిలబస్ తరహాలో క్లాస్ రూం లెర్నింగ్కు, లెక్చరర్స్పై ఆధారపడటం అనే ఆలోచనకు స్వస్తి పలకాలి. ప్రాక్టికల్ అప్రోచ్ను పెంపొందించుకోవాలి. తరగతి గదిలో ప్రొఫెసర్ ఒక కాన్సెప్ట్ చెబితే దానికి సంబంధించి మరింత లోతుగా అధ్యయనం చేయాలి.
- ప్రొఫెసర్ సరిత్ కుమార్ దాస్
డైరెక్టర్, ఐఐటీ - రోపార్
ఐఐటీలకు దీటైనవెన్నో..
Published Sat, Apr 30 2016 12:27 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?
సీవీడ్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
మిస్టర్ బీస్ట్ బర్త్డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్’ (ఫొటోలు)
బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!
టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement