
చంద్రబాబు ఏపీకి పట్టిన శని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి శుక్రవారం తిరుపతిలో నిప్పులు చెరిగారు.
తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి శుక్రవారం తిరుపతిలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఏపీకి పట్టిన శని అని వారు అభివర్ణించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. చంద్రబాబు వల్లే రాష్ట్రంలో బలిదానాలు చోటు చేసుకున్నాయని విమర్శించారు.
ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రజలకు నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి సూచించారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేస్తున్న పోరాటం తప్పక ఫలితం ఫలితాన్నిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. రేపటి బంద్కు అన్ని వర్గాల మద్దతు లభిస్తోందని వారు తెలిపారు.