'కాల్మనీ బాధితులకు న్యాయం చేస్తాం' | will justify to call money victims, says DCP kalidas | Sakshi
Sakshi News home page

'కాల్మనీ బాధితులకు న్యాయం చేస్తాం'

Dec 22 2015 4:44 PM | Updated on Sep 3 2017 2:24 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్మనీ వ్వవహారంలో బాధితులకు న్యాయం చేస్తామని డీసీపీ లేళ్ల కాళిదాసు వేంకట రంగారావు హామీ ఇచ్చారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్మనీ వ్వవహారంలో బాధితులకు న్యాయం చేస్తామని కమిషనరేట్ శాంతి భద్రతల విభాగం డీసీపీ లేళ్ల కాళిదాసు వేంకట రంగారావు హామీ ఇచ్చారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన విజయవాడలో పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదులకు 4 కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

ఇప్పటివరకు కాల్మనీ సెక్స్రాకెట్పై 400 ఫిర్యాదులు వచ్చాయన్నారు. అధిక వడ్డీతో మోసపోయామని ఎక్కువమంది ఫిర్యాదులు చేశారని ఆయన తెలిపారు. ఫిర్యాదులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలుంటాయని డీసీపీ కాళిదాసు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement