దుఃఖాన్ని దిగమింగుతూ పిండప్రదానం.. | wifes pinda pradanam at saraswati ghat | Sakshi
Sakshi News home page

దుఃఖాన్ని దిగమింగుతూ పిండప్రదానం..

Jul 18 2015 11:51 AM | Updated on Aug 1 2018 5:04 PM

సాధారణంగా ఎక్కడైనా తమ పితృదేవతలకు, పెద్దల ఆత్మ శాంతించాలని, వారికి స్వర్గలోకాలు ప్రాప్తించాలని పురుషులు పిండప్రదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

రాజమండ్రి (తూర్పుగోదావరి) : సాధారణంగా ఎక్కడైనా తమ పితృదేవతలకు, పెద్దల ఆత్మ శాంతించాలని, వారికి స్వర్గలోకాలు ప్రాప్తించాలని పురుషులు పిండప్రదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. గత ఏడాది జూన్లో తమిళనాడులో ఓ భవనం నిర్మాణదశలో ఉండగానే కూలిపోవడంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 14 మంది కూలీలు మరణించారు. దీంతో ఆ కుటుంబాల్లో మగదిక్కు లేకపోవటంతో గోదావరి పుష్కరాలలో.. మహిళలు తమ దుఃఖాన్ని దిగమింగుతూ ...తమ భర్తలకు పిండప్రదానాలు చేయాల్సి వచ్చింది. ఈ విషాద ఘటన సరస్వతీ ఘాటలో చోటుచేసుకుంది.
 
తమిళనాడులో భవనం కూలి మరణించిన తమ భర్తలకు పిండప్రదానాలు చేసేందుకు పుష్కరాలకు వచ్చారు. మరణించిన కార్మికులకు వారి భార్యలు సరస్వతీ ఘాట్లో పిండప్రదానాలు చేశారు. యర్రాపు సరోజిని అనే మహిళ తన  భర్తకు, కూతురికి పిండప్రదానం నిర్వహించగా, మంగమ్మ, గంగమ్మలు తమ భర్తలకు పిండప్రదానం చేశారు. వీరంతా తమిళనాడులో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనకు సంబంధించిన బాధితుల కుటుంబీకులు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement