రేపు విద్యాసంస్థల బంద్‌ | tomorrow educational institutions are bandh | Sakshi
Sakshi News home page

రేపు విద్యాసంస్థల బంద్‌

Sep 9 2016 12:00 AM | Updated on Mar 23 2019 9:10 PM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో శనివారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.భాస్కర్‌ తెలిపారు.

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో శనివారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.భాస్కర్‌ తెలిపారు. గురువారం గోకారి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ప్రత్యేక హోదాతో యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. విద్యాసంస్థల బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement