పట్టపగలే పట్టణంలో చోరీ | Theft on quite afternoon | Sakshi
Sakshi News home page

పట్టపగలే పట్టణంలో చోరీ

Aug 24 2016 9:18 PM | Updated on Mar 28 2019 6:18 PM

తెరిచి ఉన్న బీరువా - Sakshi

తెరిచి ఉన్న బీరువా

ట్టణంలోని నరాలశెట్టివారిపాలెంలో పట్టపగలే చోరీ జరిగింది. అదే ప్రాంతానికి చెందిన బొమ్మిడి శ్రీనివాసరావు దంపతులు బ్యాంకులో ఉన్న అప్పును తీర్చేందుకు వెళ్ళారు.

5 సవర్ల బంగారం, రూ.8 వేల నగదు అపహరణ
 
బాపట్ల టౌన్‌ : పట్టణంలోని నరాలశెట్టివారిపాలెంలో పట్టపగలే చోరీ జరిగింది. అదే ప్రాంతానికి చెందిన బొమ్మిడి శ్రీనివాసరావు దంపతులు బ్యాంకులో ఉన్న అప్పును తీర్చేందుకు వెళ్ళారు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు ఇంట్లోని తాళం తీసి బీరువాలో ఉన్న 5 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.8 వేల నగదును అపహరించుకుపోయారు. శ్రీనివాసరావు దంపతులు తిరిగి వచ్చి చూసేసరికి బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువాను పరిశీలించిగా చోరీ జరిగినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ ఎ. వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement