రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి | student dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

Sep 10 2016 12:08 AM | Updated on Nov 9 2018 4:36 PM

ఉరవకొండ ఆర్టీసీ డిపో ఎదుట శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విడపనకల్లుకు చెందిన డిప్లొమో విద్యార్థి మహేశ్‌(18) మృతి చెందినట్లు ఏఎస్‌ఐ మహేంద్ర తెలిపారు.

ఉరవకొండ : ఉరవకొండ ఆర్టీసీ డిపో ఎదుట శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విడపనకల్లుకు చెందిన డిప్లొమో విద్యార్థి మహేశ్‌(18) మృతి చెందినట్లు ఏఎస్‌ఐ మహేంద్ర తెలిపారు. ఆమిద్యాల నుంచి ప్రయాణికులతో బయలుదేరిన ఆటో మార్గమధ్యంలోని ఆర్టీసీ డిపో వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఐచర్‌ వాహనం ఢీకొనడంతో మొత్తం నలుగురు గాయపడ్డారు.

వారిలో మహేంద్ర, శంకరయ్య అనే మరో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారు. వారిని అనంతపురం ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మహేశ్‌ మరణించినట్లు వివరించారు. స్వల్పంగా గాయపడ్డ శ్రీదేవి, సురేశ్‌ ఉరవకొండ ఆస్పత్రిలో చికిత్స పొందారు.  కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement