ప్రభుత్వ ఆస్పత్రి భవనం పైకప్పు పెచ్చులూడిపడ్డ ఘటనలో చిన్నారి సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రభుత్వాస్పత్రిలో పెచ్చులూడిన పైకప్పు
Jul 23 2016 11:35 AM | Updated on Sep 4 2017 5:54 AM
- చిన్నారి సహా నలుగురికి గాయాలు
కరీంనగర్ క్రైం: ప్రభుత్వ ఆస్పత్రి భవనం పైకప్పు పెచ్చులూడిపడ్డ ఘటనలో చిన్నారి సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఆస్పత్రిలోని పిల్లలవార్డులో పైకప్పు పెచ్చులూడి పడింది. దీంతో అక్కడే చికిత్స పొందుతున్నచిన్నారి సహా నలుగురికి గాయాలయ్యాయి. ఒకే సారి పెద్ద శబ్దం రావడంలో ఆస్పత్రిలోని రోగులు భయాందోళనకు గురయ్యారు.
Advertisement
Advertisement