50 రోజులవుతోంది.. ఏం జరిగిందో చెప్పండి | siddhartha nath singh takes on rahul gandhi | Sakshi
Sakshi News home page

50 రోజులవుతోంది.. ఏం జరిగిందో చెప్పండి

Dec 29 2016 8:04 PM | Updated on Mar 29 2019 9:31 PM

50 రోజులవుతోంది.. ఏం జరిగిందో చెప్పండి - Sakshi

50 రోజులవుతోంది.. ఏం జరిగిందో చెప్పండి

అగస్టా స్కామ్‌లో సోనియా గాంధీ పేరును ఇటలీ కోర్టు ఎందుకు ప్రస్తావించిందో రాహుల్‌ గాంధీ చెప్పాలని సిద్ధార్థ్‌ నాథ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు.

కాకినాడ: అగస్టా స్కామ్‌లో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ పేరును ఇటలీ కోర్టు ఎందుకు ప్రస్తావించిందో రాహుల్‌ గాంధీ చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి సిద్ధార్థ్‌ నాథ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశం ఏదో అయిపోతోందని రాహుల్‌ ప్రస్తావించారని, పెద్ద నోట్లను రద్దు చేసి 50 రోజులు కావస్తున్నా ఎక్కడ ఏం జరిగిందో ఆయన చెప్పాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చిన సిద్ధార్థ్‌ నాథ్‌ సింగ్‌ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడారు.

ఏపీలో బీజేపీని బలోపేతం చేయడం కోసం 45 వేల బూత్‌ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించి 17 మంది బూత్‌ క్యాంపెయిన్‌ ఇంచార్జ్‌లను నియమించామని తెలిపారు. వచ్చే ఫిబ్రవరి, మార్చి కల్లా 80 శాతం బూత్‌ కమిటీలను నియమిస్తామని సిద్ధార్థ్‌ నాథ్‌ సింగ్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement