ఆటో బోల్తా : తొమ్మిది మందికి గాయాలు | nine injured | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా : తొమ్మిది మందికి గాయాలు

Sep 21 2016 11:30 PM | Updated on Sep 4 2017 2:24 PM

మండలంలోని పూతికవలస పంచాయతీ పరిధిలోని బంజారుగూడకు సమీపంలో ఆటో బోల్తా పడిన సంఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈతమానుగూడకు చెందిన 12 మంది గిరిజనులు ఆటోలో పూతికవలస వైపు బుధవారం వస్తుండగా మార్గమధ్యలో బంజారుగూడ డౌన్‌ దిగుతుండగా అదుపు తప్పి ఆటో బోల్తా పడింది.

సీతంపేట : మండలంలోని పూతికవలస పంచాయతీ పరిధిలోని బంజారుగూడకు సమీపంలో ఆటో బోల్తా పడిన సంఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈతమానుగూడకు చెందిన 12 మంది గిరిజనులు ఆటోలో పూతికవలస వైపు బుధవారం వస్తుండగా మార్గమధ్యలో బంజారుగూడ డౌన్‌ దిగుతుండగా అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఎ.కృష్ణారావు, వి.వెంకటేష్, ఎ.లక్కమ్మ, వి.ఈస్టర్, వి.నాగమ్మ, పి.పస్టు, ఎ.చంపి, ఎ.దమయంతి, ఎ.లక్ష్మయ్యలకు గాయాలయ్యాయి. వీరందరినీ మర్రిపాడు పీహెచ్‌సీకి తరలించగా అక్కడ వైద్యాధికారి చంద్రమౌళి వైద్యసేవలు అందించారు. వీరిలో చంపి, దమయంతి, లక్ష్మయ్యలకు తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన వైద్య సేవల కోసం పాలకొండ ఏరియా ఆసుపత్రికి రిఫర్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement