నూతన అడుగు | new step | Sakshi
Sakshi News home page

నూతన అడుగు

Aug 18 2016 12:18 AM | Updated on Apr 3 2019 4:24 PM

నూతన అడుగు - Sakshi

నూతన అడుగు

ఇక్కడ కనిపిస్తున్న నూతన వధూవరులు రక్తదానం ఆవశ్యకతను ప్రజలకు తెలియజేసేందుకు, దానిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి తమ పెళ్లిని వేదికగా చేసుకున్నారు.

నంద్యాల: ఇక్కడ కనిపిస్తున్న నూతన వధూవరులు రక్తదానం ఆవశ్యకతను ప్రజలకు తెలియజేసేందుకు, దానిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి  తమ పెళ్లిని వేదికగా చేసుకున్నారు.  ఆత్మకూరు బస్టాండు ప్రాంతంలోని డీవైఆర్‌ ఫంక్షన్‌ హాలులో తలంబ్రాలు పోయించుకొని అక్కడే ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఇరువురూ రక్తదానం చేయడంతో పాటు బంధువులతో కూడా చేయించారు. నంద్యాలలోని ఉప్పరిపేటకు చెందిన వరుడు ఫణీంద్ర  బెంగళూరులో ఎలక్ట్రానిక్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, రాజంపేటకు చెందిన వధువు విష్ణుగాయత్రి బీటెక్‌ పూర్తి చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement