
మన వాటా రూ.265 కోట్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం కోసం రూ.1290 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. అందులో కరీంనగర్ జిల్లాకు రూ.265 కోట్లు రానున్నాయి.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం కోసం రూ.1290 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. అందులో కరీంనగర్ జిల్లాకు రూ.265 కోట్లు రానున్నాయి. రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు కేంద్ర గ్రామీణ, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా, పారిశుధ్యశాఖ మంత్రి నరేంద్రసింగ్ ఈ రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు సూత్రప్రాయ అంగీకారం తెలుపుతూ లేఖ పంపారు. కేంద్ర మంత్రిమండలి ఆమోదం పొందిన తర్వాత ఈ నిధులు విడుదలవుతాయని పేర్కొన్నారు. కేంద్రం సూత్రప్రాయ అంగీకారంతో జిల్లాలోని మహదేవపూర్, కాటారం, కాళేశ్వరం, తుపాకులగూడెం, ముకునూరు, కన్నెపల్లి, కనుకునూర్ ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణాన్ని రహదారుల, భవనాల శాఖ అధికారులు పనులు చేపట్టనున్నారు. తద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు రహదారి సౌకర్యం అందుబాటులోకి రానుంది.