ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభ ం | i cet councelling get started | Sakshi
Sakshi News home page

ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభ ం

Jul 25 2016 11:40 PM | Updated on Sep 4 2017 6:14 AM

విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తున్న కౌన్సెలింగ్‌ అధికారులు

విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తున్న కౌన్సెలింగ్‌ అధికారులు

ఎంబీఏ, ఎంసీఏ పోస్టు గ్రాడ్యుయేషన్‌ మొదటి ఏడాదిలో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్‌–2016 కౌన్సెలింగ్‌ సోమవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్‌ కళాశాల సహాయ కేంద్రంలో ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు.

 మొదటి రోజు 150 మంది విద్యార్థులు హాజరు
 
ఎచ్చెర్ల: ఎంబీఏ, ఎంసీఏ పోస్టు గ్రాడ్యుయేషన్‌ మొదటి ఏడాదిలో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్‌–2016 కౌన్సెలింగ్‌ సోమవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్‌ కళాశాల సహాయ కేంద్రంలో ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. మొదటి రోజు కౌన్సెలింగ్‌కు 1 నుంచి 11,000 ర్యాంకుల మధ్య 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఓసీ, బీసీ విద్యార్థులు 145 మంది, ఎస్సీ, ఎస్టీలు ఐదుగురు ఉన్నారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఈ నెల 29 వరకు కొనసాగనుంది. 30న విద్యార్థులు ఆప్షన్లు మార్చుకోవచ్చు. మంగళవారం 11,001 నుంచి 22,000 మధ్య ర్యాంకుల విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. 1 నుంచి 33,000 మధ్య ర్యాంకు వారు ఈ నెల 28న ఆప్షన్లు ఇచ్చుకోవాలి. కౌన్సెలింగ్‌ను ప్రిన్సిపాల్‌ త్రినాథరావు, సహాయ కేంద్రం ఇన్‌చార్జి టీవీ రాజశేఖర్‌ పర్యవేక్షించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement