ఆర్టీసీ బస్సులో మంటలు... తప్పిన ప్రమాదం | fire accident in rtc bus all are safe | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో మంటలు... తప్పిన ప్రమాదం

Nov 15 2016 9:09 AM | Updated on Apr 7 2019 3:28 PM

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శివారులో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి.

ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శివారులో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. కడప డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు కర్నూలుకు వెళుతుండగా ఆళ్లగడ్డ శివారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి బస్సును వెంటనే ఆపారు. ప్రయాణికులందరూ బస్సు నుంచి దిగిపోయారు.

దాంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను ఆపారు. 28 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మంటలు తలెత్తడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement