మధ్యాహ్న భోజన తనిఖీలు | checkings in schools | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజన తనిఖీలు

Jul 22 2016 1:24 AM | Updated on Mar 28 2019 6:18 PM

మధ్యాహ్న భోజన తనిఖీలు - Sakshi

మధ్యాహ్న భోజన తనిఖీలు

పట్టణంలోని గోశాల సమీపంలో ఉన్న జిల్లా పరిషత్‌ బాలిక, బాలుర పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, ఎంపీడీఓ సాంబశివరావు, తహసీల్దార్‌ రామకృష్ణలు గురువారం అకస్మికంగా తనిఖీలు చేశారు.

యాదగిరిగుట్ట: పట్టణంలోని గోశాల సమీపంలో ఉన్న జిల్లా పరిషత్‌ బాలిక, బాలుర పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, ఎంపీడీఓ సాంబశివరావు, తహసీల్దార్‌ రామకృష్ణలు గురువారం అకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను మధ్యాహ్న భోజన పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. భోజన సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని సిబ్బందికి సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ, సాక్షరభారత్‌ మండల కో ఆర్డినేటర్‌ బొట్ల యాదగిరి, విద్యార్థి సంఘం నాయకులు మిట్ట అనిల్‌ కుమార్‌గౌడ్, ఆవుల సాయియాదవ్‌ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement