అచ్చంపేటను రెవెన్యూ డివిజన్‌ చేయడంపై హర్షం | Byke Rally For nadigadda bhand | Sakshi
Sakshi News home page

అచ్చంపేటను రెవెన్యూ డివిజన్‌ చేయడంపై హర్షం

Aug 18 2016 8:10 PM | Updated on Sep 4 2017 9:50 AM

లింగాల: కొత్తగా ఏర్పాటవుతున్న నాగర్‌కర్నూల్‌ జిల్లాలో నియోజకవర్గ కేంద్రంమైన అచ్చంపేటను రెవెన్యూ డివిజన్‌ చేయుటకు ప్రభుత్వం నిర్ణయించడంపై గురువారం ఎంపీపీ చీర్ల మంజుల హర్షం వ్యక్తం చేశారు.

లింగాల: కొత్తగా ఏర్పాటవుతున్న నాగర్‌కర్నూల్‌ జిల్లాలో నియోజకవర్గ కేంద్రంమైన అచ్చంపేటను రెవెన్యూ డివిజన్‌ చేయుటకు ప్రభుత్వం నిర్ణయించడంపై గురువారం ఎంపీపీ చీర్ల మంజుల హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అచ్చంపేట రెవెన్యూ డివిజన్‌గా మారితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఎంపీపీతో పాటు వైస్‌ ఎంపీపీ కిషన్‌నాయక్,ఎంపీటీసీ అల్లె ప్రియాంక,టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు రానోజీ, నాయకులు చీర్ల కష్ణ,అల్లె శ్రీనివాసులు ముఖ్యమంత్రికి కతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement