నలుగురిపై అట్రాసిటి కేసు | Sakshi
Sakshi News home page

నలుగురిపై అట్రాసిటి కేసు

Published Wed, Jul 20 2016 8:03 PM

atrasiti case on four persons

శంషాబాద్‌ రూరల్‌: కులం పేరుతో దూషించిన నలుగురు వ్యక్తులపై పోలీసులు అట్రాసిటి కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ అహ్మద్‌పాషా కథనం ప్రకారం.. నగరానికి చెందిన రాందాస్‌కు మండలంలోని పెద్దతూప్రలో వ్యవసాయం పొలం ఉంది. గ్రామానికి చెందిన ఎం.నర్సింహా కొంత కాలం పాటు ఆయన పొలంలో పనిచేశాడు. అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో రాందాస్‌ పనిలోనుంచి  తొలగించాడు. దీంతో గ్రామానికి చెందిన జాన్‌రెడ్డి, అంజయ్య, కుమార్‌, సాయిలు, మరికొందరు వచ్చి రాందాస్‌ను కులంపేరుతో దూషించడమే కాకుండా బెదిరించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు బుధవారం నలుగురిపై అట్రాసిటి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement