కారు బోల్తా, ఇంజనీరింగ్‌ విద్యార్థులు మృతి | Sakshi
Sakshi News home page

కారు బోల్తా, ఇంజనీరింగ్‌ విద్యార్థులు మృతి

Published Mon, Nov 11 2019 9:09 PM

Two Dead In Road Accident In Suryapet - Sakshi

సాక్షి, సూర్యాపేట: కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్‌ వద్ద సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ గురునానక్‌ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు గుంటూరు జిల్లా బాపట్ల వెళ్లి తిరిగి వస్తుండగా దుర్ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు ఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. కాగా, మృతులను రేవంత్‌(చంపాపేట్‌, హైదరాబాద్‌), హర్ష(బాలాపూర్‌, హైదరాబాద్‌), శశాంక్‌లుగా గుర్తించారు. వీరిలో రేవంత్‌, హర్ష ఘటన స్థలంలో మృతిచెందగా, శశాంక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement