డ్రగ్స్‌ కేసు : సినీ ప్రముఖులపై చార్జ్‌షీట్‌ | SIT Files Charge sheet In Tollywood Drugs Scandal | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కేసు : సినీ ప్రముఖులపై చార్జ్‌షీట్‌

Apr 7 2018 7:56 AM | Updated on Nov 6 2018 4:42 PM

SIT Files Charge sheet In Tollywood Drugs Scandal - Sakshi

సిట్‌ విచారణ ఎదుర్కొన్న టాలీవుడ్‌ ప్రముఖులు

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో తొలి చార్జ్‌షీటు దాఖలైంది. ఈ కేసులో అకున్‌ సబార్వాల్‌ నేతృత్వంలోని సిట్‌ 10 మంది టాలీవుడ్‌ ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, దర్శకులను విచారించారు.

సిట్‌ విచారించిన వారిలో పూరీ జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, నందు, తనీష్, ఛార్మి, ముమైత్‌ఖాన్, సుబ్బరాజు, శ్యాం కే నాయుడు తదితరులు ఉన్నారు. ముగ్గురి నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను తీసుకుని ఫోరెన్సిక్‌ పరిశీలనకు పంపారు.

తాజాగా ఫోరెన్సిక్‌ నివేదిక అందడంతో ముగ్గురు వ్యక్తులపై సిట్‌ చార్జ్‌షీటును దాఖలు చేసింది. మరికొందరికి సంబంధించిన ఫోరెన్సిక్‌ నివేదిక ఇంకా రావాల్సివుందని సిట్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌కు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement