‘దిశ’ ఇంటి వద్ద భద్రత పెంపు

Police Security Increased at Disha Home - Sakshi

సాక్షి, శంషాబాద్‌ : దిశ హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన నేపథ్యంలో ఆమె ఇంటి వద్ద భద్రతను పెంచారు. గుంపులో వచ్చి ఎవరైనా దాడికి పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆమె ఇంటి వద్ద పోలీసులు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. ఒక ఎస్సై, ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు, నలుగురు పురుష కానిస్టేబుళ్లతో భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాక, ఇంట్లోకి ఎవరినీ అనుమతించవద్దని స్పెషల్‌ టీంకు ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, నిందితుల ఎన్‌కౌంటర్‌ పట్ల అన్నిచోట్లా హర్షం వ్యక్తమవుతోంది. దీని వల్ల భవిష్యత్‌లో ఇలాంటి నేరాలకు పాల్పడాలంటే భయపడతారని పలువురు ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు.  చదవండి : దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top