తిరుమలగిరి వద్ద కారులో మంటలు...

సాక్షి, సూర్యాపేట : చివ్వెంల మండలం తిరుమలగిరి శివారు వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వారు మంటలను గమనించి తక్షణమే కిందకు దిగారు. దీంతో పెనుప్రమాదమే తప్పింది. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు ఇంజిన్‌లో సాంకేతికలోపంతోనే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top