హుబ్లీ రైల్వే స్టేషన్‌లో పేలుడు

Explosion Takes Place At Hubli Railway Station - Sakshi

 ఒకరికి తీవ్ర గాయాలు

బెంగుళూరు: కర్ణాటకలోని హుబ్లీ రైల్వేస్టేషన్‌లో సోమవారం పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకున్నా.. పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలిసిరాలేదు. పేలుడు ధాటికి గాయపడిన క్షతగాత్రుడిని దగ్గరలోని ఆస్పత్రికి స్థానికులు హుటాహుటిన తరలించారు. అకస్మాత్తుగా తక్కువ స్థాయిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంతో రైల్వేస్టేషన్‌లోని జనాలకు ముచ్చెమటలు పట్టాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. గాయపడిన వ్యక్తిని హుసేన్‌ సాబ్‌ నాయక్‌వాలేగా పోలీసులు గుర్తించారు. అనుమానాస్పదంగా ఉన్న ఒక పెట్టెను తెరవడానికి ప్రయత్నించే సమయంలో ఈ పేలుడు సంభవించిందని, పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top