మద్యం మత్తులో వ్యక్తి హత్య | Alcohol Murder In West Godavari | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో వ్యక్తి హత్య

Oct 23 2018 1:02 PM | Updated on Oct 23 2018 1:02 PM

Alcohol Murder In West Godavari - Sakshi

హత్యకు గురైన శ్రీను

పశ్చిమగోదావరి, తణుకు: మద్యం మత్తులో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన తణుకు మండలం దువ్వలో చోటు చేసుకుంది. సోమవారం జరిగిన ఈ ఘటనలో గ్రామానికి చెందిన బట్టు శ్రీను(40) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బట్టు శ్రీను కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం మద్యం తాగేందుకు గ్రామ శివారులోని మద్యం దుకాణానికి వెళ్లాడు. అక్కడే మద్యం తాగుతున్న అదే గ్రామానికి చెందిన కాపకాయల నాగేశ్వరరావు శ్రీనుతో ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. కొద్దిసేపటికి శ్రీనును సమీపంలోని శ్మశానంలోకి తీసుకెళ్లిన నాగేశ్వరరావు అక్కడ ఉన్న దుడ్డు కర్రతో తలపై బలంగా బాదాడు.

దీంతో శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. పాతకక్షలు కారణంగానే శ్రీనును హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నిందితుడు కాపకాయల నాగేశ్వరరావుపై ఇప్పటికే హత్యకేసు నమోదై ఉంది. 2015లో అదే గ్రామానికి చెందిన ఒక మహిళను ట్రాక్టర్‌ ట్రక్కుకు వేసి బాదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై తణుకు రూరల్‌ పోలీసులు హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవలే బెయిల్‌పై వచ్చిన నిందితుడు నాగేశ్వరరావు మద్యం మత్తులో మరో వ్యక్తిని హత్య చేయడం చర్చనీయాంశమైంది. మృతుడు శ్రీనుకు భార్య రాణితోపాటు ఇద్దరు సంతానం ఉన్నారు. మృతుడి భార్య   ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్సై సీహెచ్‌వీ రమేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement