జౌళి రంగానికి మరింత ఉత్తేజం! | The more excited the textiles sector | Sakshi
Sakshi News home page

జౌళి రంగానికి మరింత ఉత్తేజం!

Dec 31 2015 1:41 AM | Updated on Aug 11 2018 7:28 PM

జౌళి రంగానికి మరింత ఉత్తేజం! - Sakshi

జౌళి రంగానికి మరింత ఉత్తేజం!

జౌళి రంగానికి సంబంధించి టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ ఫండ్ స్కీమ్ (టీయూఎఫ్‌ఎస్) సవరణకు కేంద్రం ఆమోదముద్ర వేసింది

  టీయూఎఫ్ పథకం సవరణకు ప్రభుత్వం ఆమోదం
 30 లక్షల ఉద్యోగాల సృష్టి,  ఎగుమతుల వృద్ధి లక్ష్యం
 న్యూఢిల్లీ:
జౌళి రంగానికి సంబంధించి టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ ఫండ్ స్కీమ్ (టీయూఎఫ్‌ఎస్) సవరణకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత రివైజ్డ్ రీస్ట్రక్చర్డ్ టీయూఎఫ్ స్కీమ్ స్థానంలో అమలుకానున్న  సవరిత టీయూఎఫ్‌ఎస్ వల్ల జౌళి రంగంలో సాంకేతికత మరింత పురోగతి సాధించనుంది. దీనితోపాటు ఈ రంగంలో ఎగుమతుల పెంపునకు, రూ. లక్ష కోట్ల వరకూ పెట్టుబడులను ఆకర్షించడానికి, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేరడానికి కూడా ఈ నిర్ణయం దోహదపడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.  ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం ఇక్కడ సమావేశమైన  ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్  తాజా నిర్ణయం తీసుకుంది.  ముఖ్యాంశాలు చూస్తే...
 
 పథకానికి సంబంధించి రూ.17,822 కోట్ల బడ్జెట్ ప్రొవిజన్‌ను ఆమోదించింది.  ఈ మొత్తంలో రూ.12,671 కోట్లు ప్రస్తుతం అమలు జరుగుతున్న పథకం కింద ఇప్పటికే నిర్ణయించిన అంశాలకు ఉద్దేశించింది. సవరించిన టీయూఎఫ్‌కు సంబంధించి తాజా అంశాలకు మిగిలిన మొత్తం రూ.5,151 కోట్లు కేటాయించడం జరిగింది.
 
 కొత్త పథకం ప్రకారం ప్రధానంగా దుస్తులు, వస్త్రాలు- టెక్నికల్ టెక్స్‌టైల్స్ అనే రెండు విస్తృత కేటగిరీల కింద, అలాగే మిగిలిన విభాగాలకు సంబంధించిన పెట్టుబడులపై సబ్సిడీలు అందుతాయి.
 టెక్స్‌టైల్స్ కమిషనర్ ఆఫీస్ (టీఎక్స్‌సీ) కార్యాలయాన్ని పునర్  వ్యవస్థీకరించారు. ప్రతి రాష్ర్టంలో సంబంధిత కార్యాలయాలు ఏర్పాటవుతాయి. ఈ రంగంలో పారిశ్రామిక వేత్తలతో  ఎప్పటికప్పుడు  సంప్రదింపులు, కొత్త పరిశ్రమల ఏర్పాటు, పురోగతి వంటి కార్యకలాపాలను టీఎక్స్‌సీ నిర్వహిస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement