లుపిన్‌ చైర్మన్‌ దేశ్‌బంధు గుప్తా కన్నుమూత | Lupin founder Desh Bandhu Gupta dies at 79 | Sakshi
Sakshi News home page

లుపిన్‌ చైర్మన్‌ దేశ్‌బంధు గుప్తా కన్నుమూత

Jun 27 2017 1:31 AM | Updated on Jul 31 2018 5:31 PM

ప్రముఖ ఫార్మా కంపెనీ లుపిన్‌ వ్యవస్థాపకులు, చైర్మన్‌ దేశ్‌బంధు గుప్తా(79) సోమవారం ముంబైలో కన్నుమూశారు.

న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మా కంపెనీ లుపిన్‌ వ్యవస్థాపకులు, చైర్మన్‌ దేశ్‌బంధు గుప్తా(79) సోమవారం ముంబైలో కన్నుమూశారు. 1968లో గుప్తా కేవలం రూ.5,000 రూపాయలతో లుపిన్‌ ఫార్మాను ప్రారంభించారు. రూ.48,000 కోట్ల మార్కెట్‌ విలువతో నేడు ప్రపంచంలో నాలుగో అతిపెద్ద జనరిక్స్‌ ఫార్మా కంపెనీగా లుపిన్‌ ఎదుగుదల వెనుక ఆయన పాత్ర ఎంతో ఉంది. గుప్తాకు భార్య, నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

 కుమారుడు నీలేష్‌ గుప్తా ప్రస్తుతం లుపిన్‌కు ఎండీగాను, కుమార్తె వినీతా గుప్తా సీఈవోగా వ్యవహరిస్తున్నారు. తండ్రి మరణం తమను తీవ్ర విచారానికి గురి చేసిందంటూ వినీతా, నీలేష్‌ గుప్తా సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గుప్తా రాజస్థాన్‌లోని రాజ్‌గఢ్‌లో 1938లో జన్మించారు. ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివారు. చౌక ధరలకే ఔషధాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవడం అన్నది దేశానికి అత్యంత ప్రాధాన్య అంశం కావాలని ఆకాంక్షించిన వ్యక్తిగా గుప్తా గుర్తుండి పోతారని లుపిన్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement