మళ్లీ వడ్డించిన రాజన్ | interest rates hike by Reserve Bank of India | Sakshi
Sakshi News home page

మళ్లీ వడ్డించిన రాజన్

Oct 29 2013 11:47 AM | Updated on Sep 2 2017 12:06 AM

మళ్లీ వడ్డించిన రాజన్

మళ్లీ వడ్డించిన రాజన్

ఆర్బీఐ మరోసారి కీలక వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మళ్లీ  వడ్డించింది.  ముందుగా వెలువడిన సంకేతాలు నిజమైయ్యాయి. వడ్డీ రేట్లను 0.25 శాతంకు పెంచుతూ ఆర్బీఐ తన పరపతి విధానాన్ని ప్రకటించింది.   వడ్డీ రేట్ల పెంపు తర్వాత రెపోరేటు 7.75 శాతం అయింది. అయితే సీఆర్ఆర్లో మాత్రం ఎటువంటి తేడా లేదు.

ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానాన్ని గవర్నర్ రఘురామ్ రాజన్  మంగళవారమిక్కడ సమీక్షించారు. .  అనుకూల వాతావరణ పరిస్థితులతో పాటు , ఎగుమతులు పెరగడంతో  అధిక వృద్ధి నమోదవుతుందనే అంచానాలతోనే వడ్డీ రేట్లు పెంచినట్లు ఆయన తెలిపారు.  వడ్డీ రేట్లు పెంపుతో గృహ, వాహన రుణాలు మరింత ప్రియం కానున్నాయి. ఇక ఆహార పదార్ధాల ధరలు కట్టడి చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామని ,ద్రవ్యోల్బం 6 శాతానికే పరిమితం అవుతందని అంచనా వేస్తున్నట్లు ఆర్‌బిఐ తెలియచేసింది. .ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాను.5.5శాతం నుంచి 5శాతానికి తగ్గించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement