పంటలను కాల్చినవారిని అరెస్ట్ చేయరా? | ysrcp MLA takes on ap government | Sakshi
Sakshi News home page

పంటలను కాల్చినవారిని అరెస్ట్ చేయరా?

Jan 3 2015 3:32 PM | Updated on Aug 18 2018 8:05 PM

పంటలను కాల్చినవారిని అరెస్ట్ చేయరా? - Sakshi

పంటలను కాల్చినవారిని అరెస్ట్ చేయరా?

రాజధాని భూముల్లో పంటలను దహనం చేసినవారిని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మంగళగిరి వైఎస్సాఆర్‌సీపీ ఎమ్మేల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మండిపడ్డారు.

హైదరాబాద్: రాజధాని భూముల్లో పంటలను దహనం చేసినవారిని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై  మంగళగిరి వైఎస్సాఆర్‌సీపీ  ఎమ్మేల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాజధాని వ్యవహారంలో ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోంద న్నారు.

వైసీపీ వ్యక్తుల పేర్లు చెప్పమని కొంతమందిని నిర్భంధించి చిత్రహింసలు పెడుతున్నారన్నారు. మంగళగిరి రైతులను ఇప్పటికీ తుళ్లూరు పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు.  టీడీపీ మంత్రులు, ఎమ్మేల్యేలు భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే  న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. పేద రైతులకు, రైతు కూళీలకు వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement