ఆంధ్రప్రదేశ్లో నూతన రాజధాని నిర్మాణం చేపట్టనున్న గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు, కూలీల పరిరక్షణ కమిటీ గురువారం పర్యటించనుంది.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో నూతన రాజధాని నిర్మాణం చేపట్టనున్న గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు, కూలీల పరిరక్షణ కమిటీ గురువారం పర్యటించనుంది. పోలీసుల అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ బాధిత రైతులు, కూలీల కుటుంబాలను ఆ కమిటీ సభ్యులు పరామర్శించనున్నారు. ఉండవల్లి, పెనుమాక, ఉద్దండరాయునిపాలెం,లింగాయపాలెం,నిడమర్రులలో కమిటీ సభ్యులు పర్యటిస్తారు.