మీరు అన్ని రంగాల్లో పురోగమించాలి

YS Jaganmohan Reddy Comments On International Womens Day - Sakshi

మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలుగు రాష్ట్రాల మహిళలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన చేస్తూ.. ప్రతి మహిళా అన్ని రంగాల్లో సమానత్వం సాధించాలని అభిలషించారు. అన్ని రంగాల్లోనూ మహిళలు పురోగమించాలన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగానూ మహిళలు సాధికారత సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top