జ్యోతి సురేఖను అభినందించిన సీఎం వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

జ్యోతి సురేఖను అభినందించిన సీఎం వైఎస్‌ జగన్‌

Published Fri, Aug 23 2019 1:16 PM

Ys Jagan Mohan Reddy Congratulated Archer Jyothi Surekha - Sakshi

సాక్షి, అమరావతి:  నెదర్లాండ్‌లో జరిగిన 50వ ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలో వ్యక్తిగత, టీమ్‌ విభాగాల్లో కాంస్య పతకం సాధించిన వెన్నం జ్యోతిసురేఖను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందించారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ ఆర్చరీ పోటీల్లో  జ్యోతీ సురేఖ కాంస్య పతకం సాధించడం అభినందనీయమని ఏపీ సీఎం అన్నారు. మునుముందు మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి , దేశానికి మంచి పేరు తీసుకరావాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.  

Advertisement
Advertisement