244వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం  | YS Jagan 244th Day Prajasankalpayatra Begins | Sakshi
Sakshi News home page

Aug 24 2018 8:15 AM | Updated on Aug 24 2018 8:58 AM

YS Jagan 244th Day Prajasankalpayatra Begins - Sakshi

సాక్షి, విశాఖపట్నం : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 244వ రోజు పాదయాత్రను యలమంచిలి నియోజకవర్గం పురుషోత్తపురం శివారు నుంచి ప్రారంభి​చారు. అక్కడి నుంచి రేగుపాలెం జంక్షన్‌, మళ్లవరం, లైన్‌ కొత్తూరు, రామకృష్ణాపురం, సోమన్నపాలెం గాంధీనగర్‌ మీదుగా యలమంచి వరకు పాదయాత్ర కొనసాగుతుంది.

వైఎస్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement