243వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | YS Jagan Prajasankalpayatra 243th Day Schedule Released | Sakshi
Sakshi News home page

243వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

Aug 22 2018 8:43 PM | Updated on Aug 23 2018 8:18 PM

YS Jagan Prajasankalpayatra 243th Day Schedule Released - Sakshi

సాక్షి, పాయకరావుపేట: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 243వ రోజు షెడ్యూలు ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం జననేత పాయకరావుపేట నియోజకవర్గం దార్లపూడి శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి యలమంచిలి నియోజకవర్గంలోని ఎటికొప్పాక మీదుగా పద్మనాభరాజు పేట వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్‌ జగన్‌ లంచ్‌ విరామం తీసుకుంటారు.

తిరిగి మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో పాదయాత్ర పునః ప్రారంభమవుతుంది. పులపర్తి మీదుగా పురుషోత్త పురం వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement