244వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

YS Jagan Prajasankalpayatra 244th Day Schedule Released - Sakshi

సాక్షి, యలమంచిలి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 244వ రోజు షెడ్యూలు ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం జననేత యలమంచిలి నియోజకవర్గం పురుషోత్తపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి రేగుపాలెం జంక్షన్‌, మళ్లవరం, లైన్‌ కొత్తూరు, రామకృష్ణాపురం, సోమన్నపాలెం మీదుగా గాంధీనగర్‌ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్‌ జగన్‌ లంచ్‌ విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో పాదయాత్ర పునః ప్రారంభమవుతుంది. యలమంచిలి మీదుగా కొత్తపాలెం క్రాస్‌ వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top