పార్టీని గ్రామస్థాయి వరకూ బలోపేతం చేసే క్రమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ....
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పార్టీని గ్రామస్థాయి వరకూ బలోపేతం చేసే క్రమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన సమీక్ష సమావేశాల రెండో రోజు షెడ్యూల్ ఇలా ఉంది. మంగళవారం ఉదయం 9.30 గంటల నుంచి 11 వరకూ ఒంగోలు నియోజకవర్గ సమీక్ష జరుగుతుంది.
ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకూ గిద్దలూరు, యర్రగొండపాలెం, మధ్యాహ్నం రెండు గంటల నుంచి 4.30 గంటల వరకూ మార్కాపురం, కనిగిరి సమీక్ష, సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ కొండపి, దర్శి నియోజకవర్గాల సమీక్ష జరుగుతుంది. ఈ సమీక్ష సమావేశానికి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్ధులు, పార్టీ మండల అధ్యక్షులు, మండల అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా అనుబంధ సంఘాలకు చెందిన నేతలు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ముఖ్యమైన నేతలు హాజరుకానున్నారు.