నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
నెల్లూరు: నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనుసముద్రంపేట మండలం చిరమన గ్రామానికి చెందిన 100 మంది టీడీపీ కార్యకర్తలు మంగళవారం ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి నాయకులు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.