వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం | Sri Rama Pattabhishekam in Tirumala | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

Mar 29 2015 9:15 PM | Updated on Nov 6 2018 5:52 PM

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది.

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీరామ నవమి మరుసటి రోజు ఈ వైదిక కార్యక్రమం నిర్వహించటం సంప్రదాయం. సాయంత్రం సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారికి విశేష సమర్పణ చేసి ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం రాత్రి 8 గంటల నుంచి పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.  వారాంతపు సెలవుల వల్ల తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 51,942 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 15 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 12 గంటలు, కాలిబాట భక్తులకు 8 గంటల తర్వాత స్వామి దర్శనం లభించింది.

గదుల కోసం, తలనీలాలు సమర్పించేందుకు కల్యాణ కట్టల్లో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం నిర్వహించిన శ్రీవారి హుండీ లెక్కింపుల్లో  రెండు కోట్ల 94 లక్షల రూపాయలు  లభించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement