గ్రామంలో బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కన్నతల్లిని కొడుకు హతమార్చిన సంఘటన వెలుగుచూసింది.
బుధవారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి వచ్చారు. అప్పటికే రవిశంకర్రెడ్డి తల్లి తలపై కత్తితో కొట్టి హత్యచేసి ఇంట్లోనుంచి బయటికి ఈడ్చుకొచ్చి పడేశాడు. గ్రామస్తులు రావడం చూసి పారిపోయాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ నరేంద్రకుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రవిశంకర్రెడ్డి పక్క ఇంటిలో నివాసం ఉంటున్న లింగాల గంగిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేంద్రకుమార్ తెలిపారు.