రైల్వే కోడూరులో భారీ చోరీ | robbery in ysr distirict | Sakshi
Sakshi News home page

రైల్వే కోడూరులో భారీ చోరీ

Aug 20 2015 9:04 AM | Updated on Aug 30 2018 5:27 PM

వైఎస్సార్ జిల్లాలోని రైల్వే కోడూరు మండలంలో భారీ చోరీ జరిగింది.

రైల్వే కోడూరు: వైఎస్సార్ జిల్లాలోని  రైల్వే కోడూరు మండలంలో భారీ చోరీ జరిగింది. ఈ ఘటన గురువారం  ఉదయం వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రంలోని రాఘవరాజ పురంలో నివాసముండే చెంగాలవారి శంకరయ్య కుటుంబంతో సహా బుధవారం వేరే ఊరు వెళ్లాడు. దీంతో ఇదే అదునుగా భావించిన దుండగులు అర్థరాత్రి ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఆరు తులాల బంగారం, అర కేజీ వెండి, రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు యాజమాని పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement