తిరుపతిలో దొంగ అరెస్ట్ | robber arrested in tirupathi | Sakshi
Sakshi News home page

తిరుపతిలో దొంగ అరెస్ట్

Sep 12 2015 12:27 PM | Updated on Aug 30 2018 5:27 PM

చిత్తూరు జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను ఈస్ట్ పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్‌ చేశారు.

తిరుపతి: చిత్తూరు జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను ఈస్ట్ పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్‌ చేశారు. ఈస్ట్ డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, సీఐ రామకృష్ణ కథనం మేరకు వివరాలు... అనంతపురం జిల్లా కదిరికి చెందిన షేక్ అహ్మద్ అలియాస్ పీపా(22) తాళం వేసిన ఇళ్లనూ టార్గెట్ గా చేసుకుని పలు దొంగతనాలకు పాల్పడ్డాడు.

ఇతనిపై అనంతపురం వన్ టౌన్, హిందూపురం, కదిరి పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయి. కొన్ని కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు. తిరుపతిలోని విష్ణు నివాసం ను అడ్డాగా చేసుకుని గత కొద్ది రోజులుగా పట్టణంలో చోరీలకు పాల్పడుతున్నాడు. శనివారం ఉదయం విష్ణునివాసం వద్ద ఈస్ట్ పోలీసులు అతనిని అరెస్ట్‌ చేసి, 150 గ్రాముల బంగారు నగలు, ఒక కంప్యూటర్, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement