టీడీపీ ప్రభుత్వంలో నా బిడ్డకు పింఛన్‌ రావడం లేదు | People Sharing Their Sorrows To Ys Jagan | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రభుత్వంలో నా బిడ్డకు పింఛన్‌ రావడం లేదు

Apr 13 2018 7:23 AM | Updated on Aug 24 2018 2:33 PM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

‘అయ్యా.. నా బిడ్డ దివ్యాంగుడు. దివంగతనేత వైఎస్‌ హయాంలో ప్రతి నెలా వికలాంగ పింఛన్‌ వచ్చేది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పింఛన్‌ రావడం లేదు’ అంటూ దూద్‌ కృష్ణవేణి జననేత ఎదుట వాపోయారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మహానాడు రోడ్డులో జగన్‌కు వినతిపత్రం అందజేశారు. జన్మభూమి కమిటీల సిఫారసు లేదని, డాక్టర్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాలంటూ నాలుగేళ్లుగా తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి పింఛన్లు సకాలంలో అందేలా చూస్తానని జగన్‌ భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement