చెత్త కాలుస్తుండగా షాక్..ఒకరు మృతి | One killed with an electric shock | Sakshi
Sakshi News home page

చెత్త కాలుస్తుండగా షాక్..ఒకరు మృతి

Mar 22 2016 1:45 PM | Updated on Sep 5 2018 2:26 PM

పొలంలో చెత్త కాలుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైన ఓ యువరైతు ప్రాణాలు కోల్పోయాడు.

పొలంలో చెత్త కాలుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైన ఓ యువరైతు ప్రాణాలు కోల్పోయాడు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం నెరడుప్పల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గిద్దయ్య(30) మంగళవారం తన పొలానికి వెళ్లాడు. కుప్పగా వేసిన చెత్తను తగులు బెడుతుండగా కరెంటు తీగ అడ్డు వచ్చింది. దానిని పక్కకు వేసేందుకు పట్టుకోగా షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. అతడికి భార్య, కూతురు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement