పొలంలో చెత్త కాలుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురైన ఓ యువరైతు ప్రాణాలు కోల్పోయాడు.
పొలంలో చెత్త కాలుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురైన ఓ యువరైతు ప్రాణాలు కోల్పోయాడు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం నెరడుప్పల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గిద్దయ్య(30) మంగళవారం తన పొలానికి వెళ్లాడు. కుప్పగా వేసిన చెత్తను తగులు బెడుతుండగా కరెంటు తీగ అడ్డు వచ్చింది. దానిని పక్కకు వేసేందుకు పట్టుకోగా షాక్కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. అతడికి భార్య, కూతురు ఉన్నారు.