బొలెరో ఢీకొని ఒకరి మృతి | one died in road accident at kurnool district | Sakshi
Sakshi News home page

బొలెరో ఢీకొని ఒకరి మృతి

Oct 21 2015 4:18 PM | Updated on Aug 30 2018 3:56 PM

కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఆత్మకూరు : కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.


కరివెన గ్రామానికి చెందిన కృష్ణ, శేషులు, సుబ్బారాయుడు బైక్‌పై ఆత్మకూరు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో కృష్ణ అక్కడికక్కడే మృతిచెందగా, శేషులు, సుబ్బరాయుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బొలెరో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement