దుస్తులు ఆరేస్తుండగా పైనున్న కరెంటు తీగిలి ఓ వృద్దురాలు మృతి చెందింది.
దుస్తులు ఆరేస్తుండగా పైనున్న కరెంటు తీగిలి ఓ వృద్దురాలు మృతి చెందింది. విశాఖ పట్టణం జిల్లా గాజువాక ప్రాంతంలోని జోగవానిపాలెం హైస్కూల్ ఎదురుగా ఉండే దాసరి యశోద(60) గురువారం ఉదయం10.30 గంటల సమయంలో డాబాపైన దుస్తులు ఆరేస్తోంది. అయితే, డాబా మీదుగా వెళ్తున్న కరెంటు తీగలకు చేయి తగలడంతో షాక్కు గురైన యశోద అక్కడికక్కడే మరణించింది.