గుంటూరు జిల్లాలో స్వైన్‌ఫ్లూతో వ్యక్తి మృతి | man died due to swine flu | Sakshi
Sakshi News home page

గుంటూరు జిల్లాలో స్వైన్‌ఫ్లూతో వ్యక్తి మృతి

Mar 13 2015 3:14 PM | Updated on Sep 2 2017 10:47 PM

స్వైన్‌ఫ్లూతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.

నాదెండ్ల :గుంటూరు జిల్లాలో స్వైన్‌ఫ్లూతో ఓ వ్యక్తి మృతి చెందిన తాజాగా వెలుగు చూసింది. ఈ సంఘటన జిల్లాలోని నాదెండ్ల మండలంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...నాదెండ్ల మండలంలోని ఇర్లపాడు గ్రామానికి చెందిన చిన్నబాబు(40) పైప్‌లైన్ పనుల కోసం ఒంగోలు పట్టణానికి వెళ్లాడు. అయితే మార్చి7న తీవ్రమైన జ్వరం, జలుబుతో ఇంటికి వచ్చాడు. స్థానికంగా ఉండే వైద్యుడి దగ్గరకు వెళ్లగా అతను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి(జీజీహెచ్) వెళ్లాలని చినబాబుకు సూచించాడు.

 

మార్చి 9న జీజీహెచ్‌లో చేరగా స్వైన్‌ఫ్లూ కేసుగా అనుమానించిన డాక్టర్లు, రోగి రక్త నమూనాలను హైదరాబాద్ కు పంపించారు. మార్చి12న స్వైన్‌ఫ్లూ సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. అయితే స్వైన్‌ఫ్లూకి చికిత్స అందిస్తుండగానే చినబాబు శుక్రవారం ఉదయం మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement