ముల్లమూరు మండలం పెద్ద ఉల్లగల్లులో ముప్పా మోహన్రావు(27) అనే యువకుడు దారుణహత్యకు గురయ్యాడు.
ముల్లమూరు (ప్రకాశం జిల్లా) : ముల్లమూరు మండలం పెద్ద ఉల్లగల్లులో ముప్పా మోహన్రావు(27) అనే యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. కుటుంబసభ్యులే గొడ్డలితో నరికి చంపినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. గతేడాది మోహన్రావు తన అన్నను హత్య చేశాడు. ఘటన జరిగిన నాటి నుంచి విజయవాడలో ఉంటున్నాడు. చాలా రోజుల తర్వాత గురువారం స్వగ్రామం పెద్దఉల్లగల్లు వెళ్లాడు. ఇది తెలిసి అన్న భార్య తరపు బంధువులే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.