కోస్తాంధ్రకు తుపాను గండం పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడ్డ అల్పపీడనం బుధవారం నాటికే వాయుగుండంగా మారింది.
సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్రకు తుపాను గండం పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడ్డ అల్పపీడనం బుధవారం నాటికే వాయుగుండంగా మారింది. మరింత బలపడి వాయవ్య దిశగా పయనిస్తూ రానున్న 24 గంటల్లో (గురువారానికి) తీవ్ర వాయుగుండంగా మారనుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. బుధవారం రాత్రికి ఈ వాయుగుండం విశాఖకు ఆగ్నేయంగా 690 కిలోమీటర్లు, ఒడిశాలోని పారదీప్కు దక్షిణ ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుత స్థితిని బట్టి వచ్చే రెండు రోజుల్లో ఇది తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.