తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న టీఆర్ఎస్పై గురుతర బాధ్యత ఉందని సీపీఐ తెలంగాణ శాఖ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న టీఆర్ఎస్పై గురుతర బాధ్యత ఉందని సీపీఐ తెలంగాణ శాఖ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. విభజన వ్యవహారంలో చంద్రబాబు నాయుడు, కేసీఆర్ సమన్వయంతో ఉండాలని ఆయన సోమవారమిక్కడ సూచించారు. నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం సరికాదని చాడా వెంకటరెడ్డి సూచించారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవిష్యత్లో సీపీఐ, సీపీఎం కలిసి పోరాటం చేస్తాయని చాడా వెంకటరెడ్డి తెలిపారు.